మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

Jun 1 2025 1:18 AM | Updated on Jun 1 2025 1:18 AM

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి క్రైమ్‌: తిరుపతిలో నివాసముంటున్న ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అలిపిరి ఎస్‌ఐ లోకేష్‌ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని జీవకోన అరుణోదయనగర్‌లో నివాసముంటున్న రమేష్‌(43)కు భార్య సుమతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ట్రావెల్స్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలని శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

అప్పుడే మొదలెట్టేశారా?

– ఆర్టీసీ బస్సును ఆపేసిన టోల్‌గేట్‌ సిబ్బంది

ఏర్పేడు: రేణిగుంట–శ్రీకాళహస్తి మార్గం మేర్లపాక సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్‌ హైవే టోల్‌గేట్‌ వద్ద శనివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్సును టోల్‌గేట్‌ సిబ్బంది ఆపేశారు. ఆర్టీసీ యాజమాన్యం ఫాస్ట్‌ట్యాగ్‌ రీచార్జి చేశారని, అది చూపడం లేదని కండెక్టర్‌ చెప్పినా సిబ్బంది వినిపించుకోలేదు. ప్రయాణికులు సుమారు అర్ధగంట పాటు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. ఎండకు తట్టుకోలేక పలువురు వృద్ధులు బస్సులోనే నీరసించారు. చివరకు సిబ్బంది బస్సును అనుమతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement