దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగ అరెస్ట్‌

Jun 1 2025 1:18 AM | Updated on Jun 1 2025 1:18 AM

దొంగ అరెస్ట్‌

దొంగ అరెస్ట్‌

● 21 గ్రాముల బంగారు, 480 గ్రాముల వెండి స్వాధీనం

తిరుపతి క్రైమ్‌: నగరంలోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను అరెస్ట్‌ చేసినట్లు క్రైమ్‌ పోలీసులు శనివారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 4వ తేదీన ఎంఆర్‌ పల్లి సమీపంలో నివాసముంటున్న పుల్లారెడ్డి సొంత పనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. పనులు ముగించుకొని గత నెల 16వ తేదీన ఇంటికి చేరుకోగా.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంటి తాళాలు పగులగొట్టడంతోపాటు ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగలు పడినట్లు ఆనవాళ్లు గుర్తించారు. అదేవిధంగా గత రెండు నెలలుగా చెర్లోపల్లి పద్మావతి నగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దొంగతనాలు జరిగాయి. వీటిపై క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నగొట్టిగల్లుకు చెందిన భానుచంద్రాచారి అలియాస్‌ భాను నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్ట్‌ చేసి తమదైన శైలిలో విచారించారు. పై తెలిపిన నాలుగు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు అతను నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 21 గ్రాముల బంగారు, 488 గ్రాముల వెండి, రెండు సామ్‌సంగ్‌ టీవీలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement