సేవాసదన్‌ సమీపంలో పాము | - | Sakshi
Sakshi News home page

సేవాసదన్‌ సమీపంలో పాము

May 31 2025 12:33 AM | Updated on May 31 2025 12:33 AM

సేవాసదన్‌ సమీపంలో పాము

సేవాసదన్‌ సమీపంలో పాము

తిరుమల : తిరుమల సేవాసదన్‌ సమీపంలోని పార్కులో శుక్రవారం 7 అడుగుల జెర్రిపోతు కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ భాస్కర్‌ నాయుడు అక్కడకు చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

అభివృద్ధిపై

టీటీడీ ఈఓ సమీక్ష

తిరుమల : తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం, సీఆర్‌ఓ కార్యాలయం వద్ద అభివద్ధి పనులపై టీటీడీ ఈఓ జె.శ్యామలరావు శుక్రవారం అన్నమయ్య భవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా నిపుణులు తాము రూపొందించిన ప్రణాళికలను వివరించారు. ఈఓ మాట్లాడుతూ భవిష్యత్‌ అవసరాల మేరకు అభివృద్ధి చేయాలని సూచించారు. సీఆర్‌ఓ కార్యాలయం వద్ద భక్తులకు ఆధునిక వసతులు కల్పించాలని కోరారు. అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, సీఈ సత్యనారాయణ, డిజైనింగ్‌ నిపుణుడు రాముడు పాల్గొన్నారు.

బస్సును ఢీకొన్న కారు

చంద్రగిరి : తిరుపతి– మదనపల్లె జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ వద్ద శుక్రవారం బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, డ్రైవర్‌ సుదర్శన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును క్రేన్‌ సాయంతో తొలగించారు.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement