గత ప్రభుత్వంలో పండుగలా వ్యవసాయం
● అన్నదాతకు ఎల్లప్పుడూ అభయం ● రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ● ఆర్బీకేల ద్వారా పూర్తి సహకారం ● ఏడాదిలో సాగును దండగాలా మార్చిన కూటమి ప్రభుత్వం ● నిరుపయోగంగా రైతు సేవా కేంద్రాలు ● అమలు కాని అన్నదాతా సుఖీభవ ● అప్పుల పాలవుతున్న అన్నదాతలు
● ఇతడి పేరు చెంచురామయ్య. వరదయ్యపాళెం మండలం. ఆయనకు రెండు ఎకరాల భూమి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకంలో భాగంగా నగదు ఐదేళ్లపాటు అందింది. ఈ సొమ్ము పొలం దుక్కులు, విత్తనాలకు ఉపయోగపడేది. సాగుకు ముందే అప్పులు చేయాల్సిన ముప్పు తప్పేది. అలాగే ఆర్బీకేల ద్వారా అగ్రికల్చర్ అసిస్టెంట్లు సకాలంలో సలహాలు అందించేవారు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినా బీమా వచ్చేంది. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది సాగు చేసిన వరి పంట దెబ్బతింది. రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. అయితే బీమా మాటే లేదు. అన్నదాతా సుఖీభవ కింద చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇప్పుడు సాగు చేయడం కంటే కూడా పొలం బీడు పెట్టుకోవడమే మేలనుకునే దుస్థితి దాపురించింది.
జిల్లా సమాచారం
సాధారణ సాగు విస్తీర్ణం 3 లక్షల ఎకరాలు
రైతులు 2,76,000
కౌలుదారులు 14,000
రైతు సేవా కేంద్రాలు 442
సీహెచ్సీలు 338
అగ్రి ల్యాబ్లు 6
జలసిరి కింద వేసిన ఉచిత బోర్లు 506
ఉత్తుత్తి మాటలే
గత ప్రభుత్వ హయాంలో సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతింటే ఒక్కరోజులోనే పరిశీలించేవారు. వెంటనే నష్ట పరిహారం అంచనాలు వేసి ఆర్థికసాయం అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ఉత్తుత్తి మాటలే చెబున్నారు. గత ఏడాది అక్టోబరఱ్లో 7 ఎకరాలో వరి నాటేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకుంటే వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ కనీసం విత్తనాలు కూడా రాయితీపై ఇవ్వలేదు. ఇలాగే ప్రభుత్వ వైఖరి ఉంటే వ్యవసాయం పూర్తిగా వదిలేయాల్సిందే.
– తలారి ముత్యాలయ్య, చిట్టమూరు మండలం
ఉచిత బోరు ఊసే లేద
గత ప్రభుత్వంలో వైఎస్సార్ జలసిరి పేరుతో అర్హత కలిగిన ప్రతి రైతు కు ఉచితంగా బోరు వేసి ఆదుకునేవారు.ఇందులో నే మేమంతా లబ్ధిపొందాం. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఉచిత బోర్లు అనే పథకం ఊసే లేకుండా పోయింది.గతంలో నియోజక వర్గానికి రెండు బోరు మిషన్లును కేటాయించి ప్రతిగ్రామంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉచితంగా బోర్లు వేశారు.ఇప్పుడు ఆపథకం ఉందా?లేదా అనే ది కూడా చెప్పేవారే లేరు. – ఏకోలు వెంకటయ్య
రైతు, కమ్మవారిపల్లె, వెంకటగిరి మండలం
నిర్వీర్యం చేశారు
గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని సేవలను గడప వద్దకే అందజేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా పచ్చరొట్ట విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, సవిత్తనాలు, పరికరాలు అందించారు. పంటల బీమా సైతం నమోదు చేసేవారు. ప్రస్తుతం రైతు సేవాకేంద్రాలుగా మార్చినా వాటిని తెరవడం లేదు. గత ప్రభుత్వంలో ధాన్యం బస్తా రూ.2వేల నుంచి రూ.2,500 వరకు ఉండేది. ఇప్పుడు రూ.1,500 మాత్రమే పలుకుతోంది. – శేఖర్, డేగావారి కండ్రిగ,
సూళ్లూరుపేట మండలం
కూటమి ప్రభుత్వం అన్నదాతలను ఆమడదూరంలో పెట్టింది. వ్యవసాయానికి కనీస మాత్రం సహకారం కూడా అందించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఆరుగాలం కష్టించే రైతులను దగా చేస్తోంది. ఈ క్రమంలో ముందుగా విశిష్ట సేవలందించే ఆర్బీకేలను నిర్వీర్యం చేసేసింది. రైతు సేవా కేంద్రాలు పేరు మార్చి ఒక్క సేవ కూడా అందని దుస్థితికి తీసుకువచ్చింది. అన్నదాతా సుఖీభవ కింద పెట్టుబడి సాయంగా రైతులకు రూ.20వేల చొప్పున అందిస్తామని బీరాలు పలికి.. ఇప్పుడు ముఖం చాటేస్తోంది. ఇప్పటికే రబీ సీజన్లో ఎలాంటి సాయం అందించలేదు. ఇప్పుడు ఖరీఫ్ మొదలైనా ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేస్తోంది. ఈ క్రమంలోనే భూసార పరీక్షలను గాలికి వదిలేసింది. అగ్రిల్యాబ్లను నిర్ధాక్షిణ్యంగా మూసేసింది. విత్తనాలు, ఎరువుల సంగతే మరచిపోయే పరిస్థితులు తీసుకువచ్చింది. దీంతో రైతులు మళ్లీ దూరాభారం వెళ్లి విత్తనాలు, ఎరువులును కొనుగోలు చేసుకునే రోజులను పునరావృతం చేసింది. ఉచిత పంటల బీమాను తుంగలో తొక్కేసింది. నష్ట పరిహారం ఊసే లేకుండా చేసేసింది. రాయితీపై అందించే వ్యవసాయం పరికరాలను తీసుకోవాలంటేనే రైతులు భయపడే పరిస్థితి కల్పించింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా ఆపేసింది. పంట ఉత్పత్తులను దళారుల పాలు చేసేసింది. ఇక కౌలు రైతులనైతే పూర్తిగా విస్మరించింది. మొత్తం మీద కేవలం ఒక్క ఏడాదిలోనే వ్యవసాయం దండగ అని అన్నదాతలే అనుకునే దుస్థితిని తీసుకువచ్చింది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమానికే పెద్దపీట వేసేవారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నాటి పాలకులు విశ్వసించేవారు. ఇదే లక్ష్యంతో వినూత్నమైన పథకాలు, విధానాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సులువుగా అందించేందుకు ఆర్బీకేలను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల ద్వారా అన్నదాతల ఇంటి ముంగిటకే సర్వం అందజేసేవారు. అలాగే సీజన్ ఆరంభానికి ముందే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించేవారు. భూసార పరీక్షలు చేయించి, ఎలాంటి పంటలు సాగు చేయాలో అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలోనే పలు చోట్ల అగ్రిల్యాబ్లను ప్రారంభించారు. పంటలకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించేవారు. ఒక వేళ పంట నష్టపోతే వెంటనే పరిహారం చెల్లించేవారు. సకాలంలో బ్యాంకుల ద్వారా సున్నావడ్డీ రుణాలు మంజూరు చేయించేవారు. ఇదే విధానాలను కౌలురైతులకు సైతం వర్తింపజేసేవారు. వైఎస్సార్ జలసిరి కింద ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయించేవారు. రైతులు పండించే ఉత్పత్తులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టేవారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాత ఆర్థికంగా బలపడేందుకు పూర్తి సహకారం అందించేవారు. పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేవారు. సీజన్ మొదలయ్యే సరికే విత్తనాల పంపిణీ చేపట్టేవారు. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అందుబాటులో ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకునేవారు.
డ్రోన్ టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్)
మత్తేరి మిట్టలో నిరుపయోగం రైతు భరోసా కేంద్రం
నిలువునా మోసం చేశారు
గతంలో చంద్రబాబు రుణమాఫీ అంటూ రైతులను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు ఇస్తామని గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. రైతులకు పైసా కూడా విదల్చలేదు. సాయం కోసం ఎదురుచూపులు తప్పని దుస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా ప్రతి రైతుకు పెట్టుబడి సహాయంగా రూ.13.500 నేరుగా ఖాతాలోనే జమ చేసేవారు. ఈ సీజన్లో సాగు చేద్దామంటే అప్పులు చేయాల్సి వస్తోంది.
– దామోదర్రాజు, రాజుల ఎరుగుంటపాళెం, సైదాపురం మండలం
సంబరంగా సాగు చేశాం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంబరంగా సాగు చేశాం. వ్యవసాయంలో నాలుగు రాళ్లు సంపాదించాం. అప్పట్లో పెట్టుబడి సాయంగా ఏటా రైతు భరోసా కింద నగదు అందించేవారు. ఆర్బీకేల ద్వారా ఇంటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వచ్చేవి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేవారు. పుష్కలంగా సాగునీరు సరఫరా చేసేవారు. దీంతో మా కుటుంబాలు హాయిగా జీవనం సాగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయం అంటేనే భయపడాల్సిన దుస్థితి దాపురించింది.
– పాకాల ఏడుకొండలు, తిప్పిరెడ్డిపల్లె, సైదాపురం మండలం
అన్ని విధాలుగా దగా
కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలు గా దగా చేస్తోంది. నాకు ఒకటిన్నర ఎకరా ఉంది. గత సర్కారు హయాంలో సీజన్కు ముందుగానే రైతు భరోసా సొమ్ము అందించారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు రాయితీపై పంపిణీ చేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించారు. ఇప్పుడు ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్టుబడి సాయం లేదు. రైతు సేవా కేంద్రాలు అన్నారు.. వాటిని ఎప్పుడూ మూసే ఉంటున్నారు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కేశారు.
– ఎన్.రమణారెడ్డి, నరసారెడ్డి కండ్రిగ, నాయుడుపేట
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగ