ఆరోగ్యంపై శ్రద్ధ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ ముఖ్యం

May 27 2025 1:57 AM | Updated on May 27 2025 1:57 AM

ఆరోగ్యంపై శ్రద్ధ ముఖ్యం

ఆరోగ్యంపై శ్రద్ధ ముఖ్యం

– నేడు ఆర్టీఓ కార్యాలయంలో బేసిక్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ స్కిల్స్‌పై శిక్షణ

తిరుపతి మంగళం : వాహనదారులంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మంగళవారం ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా మంగళంలోని ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ఙ్‌ బేసిక్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ స్కిల్స్‌ శిక్షణా కార్యక్రమాన్ని అమర ఆసుపత్రి సౌజన్యంతో మంగళవారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలబెట్టే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రాణాలను రక్షించే అత్యవసర ప్రతిస్పందన నైపుణ్యాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. శిక్షణలో పాల్గొనే వైద్య నిపుణుల గురించి తెలియజేశారు.

ఈవీఎం గోడౌన్ల తనిఖీ

రేణిగుంట: రేణిగుంట పాత విమానాశ్రయం రహదారిలో ఉన్న ఈవీఎంస్‌, వీవీప్యాట్‌లను భద్రపరిచిన గోడౌన్లను సోమవారం డిప్యూటీ సీఈఓ విశ్వేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా షట్టర్లకు వేసిన సీళ్లను, సీసీ కెమెరాలను పరిశీలించి, భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జీఎన్‌ఎస్‌ఎస్‌ డిప్యూటీ కలెక్టర్‌, నోడల్‌ అధికారి సుధారాణి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌ రెడ్డి, ఎన్నికల సూపరింటిండెంట్‌ ప్రసాద్‌, రేణిగుంట తహసీల్దార్‌ సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement