ఆర్టీసీ ఆదాయం పెంచండి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆదాయం పెంచండి

May 27 2025 1:57 AM | Updated on May 27 2025 1:57 AM

ఆర్టీసీ ఆదాయం పెంచండి

ఆర్టీసీ ఆదాయం పెంచండి

సత్యవేడు: సమయానికి బస్సులు నడుపుతూ, డ్రైవర్లు, కండక్టర్లు సమయపాలన పాటిస్తూ, ప్రయాణికులు చేయి ఎత్తిన చోట బస్సు ఆపుతూ ఆర్టీసీకి ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు పిలుపునిచ్చారు. సోమవారం సత్యవేడు ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ వేసవిలో ఆర్టీసీ బస్టాప్‌లో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు డిపో నుంచి విజయవాడ సర్వీసు, ఊత్తుకోట మీదుగా చైన్నె సర్వీసు, సత్యవేడు–చిత్తూరు సర్వీసు, సూళ్లూరుపేట– ఊత్తుకోట సర్వీసులు నడపాలని కోరారు. నాగలాపురం ఆర్టీసీ బస్టాడును ఆధునీకరించాలన్నారు.

ఉత్తమ డ్రైవర్లకు సన్మానం

ఉత్తమ డ్రైవర్లను ఎండీ ఘనంగా సత్కరించారు. ఇందులో ఆయిల్‌ సేవ్‌ అవార్డులను డ్రైవర్లు ఎం.మధు, వీరయ్యకు అందజేశారు. బెంగళూరు సర్వీసులో అధిక ఆదాయం తీసుకొచ్చిన డ్రైవర్‌ సురేష్‌కు క్యాష్‌ అవార్డులు అందజేశారు. ఈడీ చెంగల్‌రెడ్డి, ఆర్‌ఎం వెంకటరమణ, డీఎం వెంకటరత్నం, ఆర్టీసీ యూనియన్‌ నాయకులు చెంచులయ్య, బాబు, గోవిందయ్య, మురళీ(చికెన్‌ చిన్నా), వికేఎన్‌ పరమశిం(బాషా), బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement