
ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్: యూపీఎస్సీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆదివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, శ్రీపద్మావతి కళాశాల్లోని పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్, జిల్లా ప్రతేక అధికారి కోన శశిధర్, జాయింట్ సెక్రటరీ ఎస్జీ అజ్మీరా, డీఆర్ఓ నర సింహులుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లా డుతూ మొత్తం ఉదయం నిర్వహించిన పరీక్షకు 5,261 మందికి గాను 2,941 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 2,320 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5,261 మందికి గాను 2,929 మంది హజరైనట్లు తెలిపారు. 2,332 మంది గైర్హాజరైనట్లు వివరించారు. అభ్యర్థులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు.
ముగిసిన లాసెట్ దరఖాస్తుల గడువు
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాసెట్–2025 ప్రవేశ పరీక్షకు అపరాధ రుసుముతో దరఖాస్తుల గుడువు ఆదివారంతో ముగిసింది. వచ్చే నెల 5వ తేదీన జరగనున్న లాసెట్ పరీక్షకు 27,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఆన్న్లైన్లో హాల్టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు
భయపెడుతున్న బయో వేస్ట్
తిరుపతి తుడా : తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో పేరుకుపోయిన బయో మెడికల్ వేస్ట్ భయపెడుతోంది. ఐడీహెచ్ వార్డు వెనుక టన్నుల కొద్దీ బయో మెడికల్ వేస్ట్ను డంపింగ్ చేశారు. ప్రతిరోజూ తరలించాల్సిన వేస్ట్ను ఆరు నెలలుగా తొలగించలేదు. దీనికితోడు చెత్తాచెదారాలను సైతం అందులోనే పడేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం దుర్వాసన వెదజల్లుతోంది. వర్షాలకు తడిచిన వ్యర్థాల నుంచి విషపూరిత రసాయనాలు భూమిలోకి ఇంకుతున్నాయి. ఈ క్రమంలో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదముంది. దీనిపై నిపుణులు హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారులు స్పందించి బయోవేస్ట్ను వెంటనే తొలగించాల్సిన అవసరముంది.

ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు