
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చంద్రగిరి: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నాగయ్యగారిపల్లి సమీపంలోని స్వర్ణముఖినదిలో కొంతమంది అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే అధికార పార్టీకి చెందిన నేతల ట్రాక్టర్లు పగలూ రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తుంటే పోలీసులు పట్టించుకోరు కానీ.. తమలాంటి సామాన్యులు సొంత అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్తే ఇలా కేసులు పెట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుల్లో నాగయ్యగారిపల్లి స్వర్ణముఖినదిలో జేసీబీలతో ఇసుకను తరలిస్తున్నారని, పోలీసులు మాత్రం వారి వద్ద మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారంటూ మండిపడుతున్నారు.