ఐడియాథాన్‌ ఆవిష్కరణల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఐడియాథాన్‌ ఆవిష్కరణల ప్రదర్శన

May 1 2025 1:40 AM | Updated on May 1 2025 1:40 AM

ఐడియా

ఐడియాథాన్‌ ఆవిష్కరణల ప్రదర్శన

తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో ఐడియాథాన్‌–2025పేరుతో ‘స్థిరమైన పర్యావరణానికి నూతన ఆవిష్కరణలు’ అనే అంశపై బుధవారం జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ టెక్నాలజీస్‌ ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హెచ్‌ఎన్‌ చాణక్య (బెంగళూరు) ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకోసం స్థిరమైన వనరుల వినియోగంపై ఆయన ప్రసంగించారు. అనంతరం ప్రదర్శన పోటీలలో ప్రతిభ చాటి తొలి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థుల బృందాలకు వరుసగా రూ.10వేలు, రూ.6వేలు, రూ.3వేలు నగదు బహుమతులతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రజని, డాక్టర్‌ రవిశంకర్‌ (తిరుపతి ఐఐటీ), ఐజర్‌ నుంచి డాక్టర్‌ అంబరీష్‌ సక్సేనా, ప్రొఫెసర్‌ కాత్యాయిని, ప్రొఫెసర్‌ విద్యావతి, డాక్టర్‌ జే.సూర్యకుమార్‌, పర్యావరణ కార్యకర్త పి శివాజి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఐడియాథాన్‌ ఆవిష్కరణల ప్రదర్శన 1
1/1

ఐడియాథాన్‌ ఆవిష్కరణల ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement