అర్ధరాత్రి వరకు శ్రమించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి వరకు శ్రమించిన పోలీసులు

Oct 2 2025 7:50 AM | Updated on Oct 2 2025 7:50 AM

అర్ధర

అర్ధరాత్రి వరకు శ్రమించిన పోలీసులు

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ వద్ద మంగళవారం యాసిడ్‌ ట్యాంకర్‌ బోల్తా పడగా.. దాని కింద పడి నలిగిపోయిన తూఫాన్‌ వాహనాలను బయటకు తీసేందుకు పోలీసులు అర్ధరాత్రి వరకు శ్రమించారు. యాసిడ్‌ ట్యాంకర్‌ తలకిందులుగా పడటం, అందులో యాసిడ్‌ ఉండడం, పోలీసులు రెండు జేసీబీలు, మూడు క్రేన్‌లు తీసుకొచ్చి ఐదు గంటలకు పైగా శ్రమించిన తర్వాత ట్యాంకర్‌ పైకి లేచింది. దానిని రోడ్డు పక్కకు ఉంచారు. అదేవిధంగా ట్యాంకర్‌ కింద నుజ్జునుజ్జయిన తూఫాన్‌ వాహనాలను బయటకు తీశారు.

నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 4,14,188 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది. అంతే నీటిని సాగర్‌ జలాశయం నుంచి విడుదల చేస్తున్నారు. 26 రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా 3,61,322 క్యూసెక్యులు, విద్యుత్‌ ఉత్పాదన ద్వారా 33,536, మొత్తం 3,94,858 క్యూసెక్యుల నీటిని దిగువకు కృష్ణానదిలోకి వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువ, ఏఎంఆర్పీ, వరద కాలువలకు 19,330 క్యూసెక్యుల నీటిని వదులుతున్నారు.

అర్ధరాత్రి వరకు శ్రమించిన పోలీసులు1
1/1

అర్ధరాత్రి వరకు శ్రమించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement