
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం
సూర్యాపేట టౌన్: బైక్పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం తొగర్రాయికి చెందిన లిక్కి రామారావు(46) దురాజ్పల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రి బైక్పై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలో గల అండర్ పాస్ నుంచి కొత్త బస్టాండ్కు వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది. రామారావుకు తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు.
గుండెపోటుతో చేనేత కార్మికుడు మృతి
రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు పున్న నర్సింహ (47) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. పున్న నర్సింహ మధ్యాహ్నం అస్వస్థతకు గురై ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.