మండే కాలం.. జర భద్రం! | - | Sakshi
Sakshi News home page

మండే కాలం.. జర భద్రం!

Apr 26 2025 1:39 AM | Updated on Apr 26 2025 1:39 AM

మండే

మండే కాలం.. జర భద్రం!

లోక రక్షణార్థమే ఏసు జననం
లోక రక్షణార్థమే ఏసుక్రీస్తు జన్మించారని విజయవాడ మేత్రాసన పీఠాధిపతి జోసెఫ్‌ రాజారావు అన్నారు.

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

42 డిగ్రీలకుపైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు

మే నెలలో 46 డిగ్రీలకు చేరే అవకాశం

ఇప్పటికే ఆల్ట్రా వైలెట్‌ (యూవీ) 10 శాతం నమోదు

ఈ పరిస్థితుల్లో జనంతోపాటు.. పశుపక్షాదుల రక్షణ తప్పనిసరి

వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను కాపాడుకోవాలి

నల్లగొండ : వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మండుతున్నాయి. ఓజోన్‌ పొర దెబ్బతిని సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి పెరిగి జనం అల్లాడుతున్నారు. డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. దీనికి తోడు ఏసీల వాడకం పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఈ కారణంగా జిల్లాలో ఆల్ట్రా వైలెట్‌ (యూవీ) పది శాతం నమోదవుతోంది. ఆకాశంలో తెల్లటి మేఘాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం జాగ్రతలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి మంగ్యానాయక్‌ సూచిస్తున్నారు.

కోదాడ, రామగిరి(నల్లగొండ), నకిరేకల్‌ : వేసవిలో జంతు ప్రేమికులు వారి పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.

● ఎప్పటికప్పుడు శుభ్రమైన, చల్లటి నీటిని

అందుబాటులో ఉంచాలి.

● పెంపుడు జంతువు ఉండే ప్రాంతం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. గాలి వేగంగా వెళ్తున్న స్థలాన్ని ఎంచుకోవాలి.

● మధ్యాహ్నం సమయంలో నేలపై నడవనివ్వకూడదు.

● ఊపిరాడకపోవడం, అలసట, అధిక నిద్ర లాంటి లక్షణాలను గ్రహించాలి. వాటి శరీరానికి తగినంత గాలితీసుకునే అవకాశం ఇవ్వాలి.

● పెంపుడు జంతువులు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయకుండా.. గాలి మార్పిడి ఉండేలా చూసుకోవాలి.

● తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి.

● వేసవి ఒత్తిడిని తగ్గించడానికి వాటికి టానిక్‌లను తాగించాలి.

● పక్షుల సంరక్షణకు ఇంటి గోడలు, వరండాలు, డాబాలపై చిన్నచిన్న చిప్పల్లో నీళ్లు పోసి ఉంచాలి.

● వీటి పక్కనే చిరుధాన్యపు గింజలు పోసి ఉంచాలి.

● రోడ్ల వెంట ఉండే చెట్ల మొదళ్ల వద్ద కూడా నీటి వసతులు కల్పించాలి.

సేవ్‌ బర్డ్స్‌ క్యాంపెయిన్‌లో పాల్గొనాలి

వేసవిలో పక్షులు దాహార్తి తీర్చడానికి ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కానీల్లో నీటి చిప్పలు, కృతిమ గూళ్లను, ఫీడర్లను ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కనీల్లో పిట్టగోడలపై పిల్లల చేత నీటి కుప్పలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. ధాన్యపు చిప్పలను కూడా ఏర్పాటు చేసి పక్షుల మనుగడకు దోహదపడాలి. సేవ్‌ బర్డ్స్‌ క్యాంపెయిన్‌లో అందరూ భాగస్వాములు కావాలి.

– కనుకుంట్ల విద్యాసాగర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, నకిరేకల్‌

న్యూస్‌రీల్‌

పెంపుడు జంతువులు – జాగ్రత్తలు..

మండే కాలం.. జర భద్రం!1
1/4

మండే కాలం.. జర భద్రం!

మండే కాలం.. జర భద్రం!2
2/4

మండే కాలం.. జర భద్రం!

మండే కాలం.. జర భద్రం!3
3/4

మండే కాలం.. జర భద్రం!

మండే కాలం.. జర భద్రం!4
4/4

మండే కాలం.. జర భద్రం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement