
భూ భారతితో రైతులకు సత్వర న్యాయం
అర్వపల్లి: భూ భారతి చట్టంతో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. భూ భారతి చట్టంపై అర్వపల్లిలో గురువారం నిర్వహించిన సదస్సుకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి పాల్గొని మాట్లాడారు. భూ భారతి ద్వారా గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించవచ్చని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ ధరణితో రైతులు పడిన కష్టాలను చూసిన సీఎం రేవంత్రెడ్డి భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. త్వరలో రైతుల భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ భూసమస్యలను పరిష్కరించి రైతులు, ఇళ్ల యజమానులకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ సదస్సులో ఆర్టీఓ వేణుమాధవరావు, తహసీల్దార్లు జక్కర్తి శ్రీనివాసులు, బ్రహ్మయ్య, హరిప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బైరబోయిన సైదులు, జలేందర్రావు, ఎంపీడీఓ గోపి, ఏఓ గణేష్, నాయబ్ తహసీల్దార్ సీహెచ్. యాదగిరి, ఏపీఓ ఉపేందర్, గిర్దావర్లు జలేందర్రావు, వెంకట్రెడ్డి, ప్రసన్న, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అవిలయ్య, నాయకులు గుడిపల్లి మధుకర్రెడ్డి, జీడి వీరస్వామి, బైరబోయిన మహరాజు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్