ఉన్నత శిఖరాలను అధిరోహించాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Apr 24 2025 8:31 AM | Updated on Apr 24 2025 8:31 AM

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

నూతనకల్‌: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్‌ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి.. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకన్న–సుమలత దపంతుల రెండో కుమార్తె వైష్ణవి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో ఎంపీసీ విభాగంలో 467మార్కులు సాధించడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వైష్ణవిని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తీగల గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగం జయసుధ, మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్‌రెడ్డి, జెన్నారెడ్డి వివేక్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement