దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్‌

Jun 2 2025 12:14 AM | Updated on Jun 2 2025 12:14 AM

దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్‌

దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్‌

అరసవల్లి: జిల్లాలో రేషన్‌ డిపోలను పునఃప్రారంభిస్తున్నామని, ఈ క్రమంలో దివ్యాంగులకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటికే వెళ్లి రేషన్‌ అందజేయనున్నట్లుగా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం అరసవల్లిలో డీసీఎంఎస్‌లో రేషన్‌ డిపోను పునఃప్రారంభించిన అనంత రం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకా రం నిత్యావసర సరుకులన్నీ ఇక రేషన్‌ దుకాణాల నుంచే కార్డుదారులకు సరఫరా చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 6.60 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని, మొత్తం 1602 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీలోగా నిత్యావసర వస్తువులు అందజేయనున్నట్లు వివరించారు. జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులకు చెందిన కార్డులు సుమా రు 67 వేల వరకు ఉన్నాయని, వీరందరికీ రేషన్‌ డీలర్ల ద్వారానే ఇంటికే రేషన్‌ వస్తుందని ప్రకటించారు. ఇక అరసవల్లి డీసీఎంఎస్‌ పరిధిలో 764 కార్డుదారులుండగా, బొంపాడ వీధిలో ఓ దివ్యాంగురాలు, ఒక వృద్ధునికి ఇంటికే వెళ్లి కలెక్టర్‌ స్వయంగా రేషన్‌ను అందజేశారు. అలాగే రేషన్‌ ప్రక్రియ కోసం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని, సమస్యలుంటే ఎవరైనా కంట్రోల్‌రూంను సంప్రదించవచ్చునన్నారు. అలాగే జిల్లాలో ప్ర తి రేషన్‌ డిపో కూడా సమయపాలన పాటించాలని, రోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, అ లాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయాలన్నారు. ప్రస్తుతానికి బియ్యం, పంచదార మాత్రమే అందజేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement