రైలు కిందపడి... | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి...

Oct 7 2025 4:09 AM | Updated on Oct 7 2025 4:09 AM

రైలు

రైలు కిందపడి...

అనంతపురం సిటీ: స్థానిక తాటిచెర్ల మార్గంలోని నేషనల్‌ హైవే బ్రిడ్జి కింద సోమవారం గూడ్స్‌ రైలు కింద పడి మల్లెల రవికుమార్‌(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించినా ఆ తరువాత మృతుడు అనంతపురం రూరల్‌ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రవికుమార్‌గా గుర్తించినట్లు వివరించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారన్నారు. కుటుంబ కలహాలు, ఆర్థికపర సమస్యలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

ఆత్మకూరు: ట్రాక్టర్‌ అదుపు తప్పి నేరుగా వెళ్లి బావిలో పడింది. వివరాలు.. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం ట్రాక్టర్‌తో తన పొలంలో సేద్యం చేస్తుండగా అదుపు తప్పి నీళ్లు లేని బావిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్‌తో పాటు బావిలో పడిన రామచంద్రారెడ్డిని వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మంచానికి తాళ్లు కట్టి బావిలో దించారు. అనంతరం దానిపై రామచంద్రారెడ్డిని చేర్చి పైకి లాగారు. తీవ్ర గాయాలైన రామచంద్రారెడ్డిని 108 అంబులెన్స్‌లో అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు.

రైలు కిందపడి...1
1/1

రైలు కిందపడి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement