రెక్కలు విరిగిన పూలు | - | Sakshi
Sakshi News home page

రెక్కలు విరిగిన పూలు

Sep 25 2025 12:32 PM | Updated on Sep 25 2025 12:32 PM

రెక్కలు విరిగిన పూలు

రెక్కలు విరిగిన పూలు

పడిపోయిన ధరలతో

రోడ్డు పక్కన పారబోత

పరిగి: బంతి పూల ధర అమాంతం పడిపోయాయి. కనీసం రవాణా చార్జీలు కూడా దక్కని పరిస్థితుల్లో రైతులు రోడ్డు పక్కన పారబోస్తున్నారు. తాజాగా బుధవారం ఓ రైతు బంతిపూలను హిందూపురం మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ మార్గమధ్యంలోనే ఆయనకు పూల ధర గురించి తెలిసింది. హిందూపురం వెళ్లినా ట్రక్కు రవాణా చార్జీ కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పరిగి మండలంలోని సేవామందిరం – హిందూపురం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన వద్ద వాహనం నిలిపి బంతిపూలను పారపోసి వెళ్లిపోయాడు. కిలో కనీసం రూ.50 అయినా పలుకుతాయనుకుంటే బుధవారం రూ.10 కూడా పలకని పరిస్థితుల్లో రైతు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రైతు పారబోసిన బంతి పూలను స్థానికులు బ్యాగ్‌లలో, కవర్‌లలో నింపుకుని వెళ్లడం గమనార్హం.

రైల్వే కార్మికులకు

78 రోజుల బోనస్‌

గుంతకల్లు: రైల్వే కార్మికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరా పండగ సందర్భంగా 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్‌ బోనస్‌ కార్మికులకు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సమాచారం అందినట్లు డివిజన్‌ అధికారులు తెలిపారు. దీంతో గుంతకల్లు డివిజన్‌ వ్యాప్తంగా ఉన్న దాదాపు 14,500 మంది కార్మికులకు సుమారు రూ.24 కోట్లు మంజూరు కానున్నాయి. ఒక్కో కార్మికుని బోనస్‌ రూపంలో రూ.17,951 మేర ఖాతాల్లో జమ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement