సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చర్యలు

Sep 30 2025 8:39 AM | Updated on Sep 30 2025 8:39 AM

సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యల పరిష్కారానికి చర్యలు

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

నెల్లూరు(అర్బన్‌): అర్జీదారుల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పలు అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీలు పదేపదే వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు తాగునీరు, భోజన వసతి కల్పించడం, అదనంగా పందిళ్లు ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబందించి ఈ – ఆఫీసులో ఫైళ్లను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపాలని సూచించారు. ప్రతి ఫైలుకు ప్రత్యేక క్రమ సంఖ్యను కేటాయించి ఆ నంబర్‌ మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు.

● జీఎస్టీ 2.0 ఫలాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా రూపొందించిన సూపర్‌ జీఎస్టీ సూపర్‌ సేవింగ్స్‌ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, జీఎస్టీ జాయింట్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement