పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ

Sep 26 2025 6:08 AM | Updated on Sep 26 2025 6:08 AM

పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ

పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

నెల్లూరు రూరల్‌: ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఫారం – 6లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. వీటిని సంపూర్ణంగా పూర్తి చేసేలా నూతన ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. డీఆర్వో విజయ్‌కుమార్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement