
పెద్దఅంబర్పేటలో మరో పంచాయతీ విలీనం
అబ్దుల్లాపూర్మెట్: పెద్దఅంబర్పేట పురపాలక సంఘంలో మరో గ్రామ పంచాయతీ విలీనం అయ్యింది. ఈ మున్సిపాలిటీకి ఆను కుని ఉన్న యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలానికి చెందిన సాయినగర్ను తెలంగాణ మున్సిపల్ చట్టం –2025ను అనుసరించి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విలీనం చేసినట్లు కమిషనర్ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలోని రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. పంచా యతీ భవనానికి ఉన్న పేరును తొలగించి పెద్దఅంబర్పేట పురపాలక సంఘం వార్డు కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా విలీనం అయిన సాయినగర్ పంచాయతీతో కలిపి పెద్దఅంబర్పేట పురపాలక సంఘంలో మొత్తం 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.