
మైసిగండిలో భక్తుల కిటకిట
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన మైసమ్మ తల్లిని బుధవారం భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం కావడంతో మైసిగండి ఆలయ పరిసరాలు భక్తజనంతో నిండిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదే విధంగా వాహన పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్గౌడ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, ఆలయ అర్చక సిబ్బంది తదితరులు ఉన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు

మైసిగండిలో భక్తుల కిటకిట