
రైతుబిడ్డకు మూడో ర్యాంక్
ముస్తాబాద్(సిరిసిల్ల): రైతుబిడ్డ జిల్లా మూడో ర్యాంకర్గా నిలిచాడు. ముస్తాబాద్ మండలం మోహినికుంటకు చెందిన పల్లాటి మల్లేశం, జమున దంపతుల మూడో కుమారుడు పల్లాటి అరుణ్కుమార్ పదో తరగతిలో 579 మార్కులు సాధించా డు. ముస్తాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చదివిన అరుణ్కుమార్ టాపర్గా నిలవడంపై ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్ అభినందించారు. అరుణ్ తండ్రి వ్యవసాయం చేస్తుండగా, తల్లి జమున మోహిని కుంటలో ఆశవర్కర్. అరుణ్ పెద్దసోదరుడు మహేశ్ జ గిత్యాలలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుండగా, రెండో సోదరుడు భరత్ ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని అరుణ్ పేర్కొన్నాడు.