
ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా సబ్ జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు శనివారం కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది బాలురు, 30 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో నైపుణ్యం కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ జట్లకు పామూరులోని సెయింట్ మార్క్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శిక్షణ శిబిరం ఉంటుందన్నారు. 15 నుంచి 18వ తేదీ వరకు చిత్తూరులో జరిగే సబ్ జూనియర్స్ రాష్ట్ర చాంపియన్షిప్లో పాల్గొంటారు. ఎంపికలో జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి టి.సుబ్బారావు, కోశాధికారి ముప్పారపు జయకుమార్, మెంబర్ సయ్యద్ జిలానీబాషా, పలువురు పీడీలు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక