పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి

Jun 1 2025 1:03 AM | Updated on Jun 1 2025 1:03 AM

పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి

పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి

విజయనగరం అర్బన్‌: పశువుల అక్రమ రవాణాపై అధికారులు నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని విజయనగరం ఆర్డీవో టి.సవరమ్మ ఆదేశించారు. తన కార్యాలయంలో డివిజన్‌ జంతు సంక్షేమ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లొట్లపల్లి, మోపాడ జంతువులు మరియు పశువుల సంతల్లో పశువులను హింసాత్మకంగా అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సంతకు లైసెన్స్‌ లేకపోయిన అక్రమంగా సంత నిర్వహిస్తున్నట్టు దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో పశువధశాల లేకపోయినా పశుమాంస వ్యాపారాలు చేసుకునేందుకు లైసెన్స్‌లు ఇచ్చిన మున్సిపల్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గో సంరక్షణ క్యాలెండర్‌ను ఆర్డీవో ఆవిష్కరించారు. సమావేశంలో డివిజనల్‌ పంచాయతీ అధికారి ఆరికతోట మోహనరావు, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ధర్మారావు, పి.అనురాధ, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కె.చంద్రశేఖర్‌రావు, డివిజన్‌ పరిధిలో మండలాధికారులు, గో సంరక్షణ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

విజయనగరం ఆర్డీవో టి.సవరమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement