
నేటి నుంచి నందన్న ఉత్సవాలు
పర్లాకిమిడి: జిల్లాలోని నందన్మ ఉత్సవాలకు గ్రామీణులు సన్నద్ధం అవుతున్నారు. దీపావళి వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ గ్రామంలో ఇంటింటికీ వచ్చే నందన్నకు కాలుకడిగి ఆశ్వీరదం అందుకుంటారు. పర్లాకిమిడితోపాటు కాశీనగర్, గుసాని ప్రాంతాల్లో ఈ పండగ నిర్వహిస్తారు. మార్కెట్లో పండ్లు, కొబ్బరికాయలు, అరటి పండ్లు, తోరణాలు అధిక ధరలు పలికాయి. చిత్రకార వీధిలో నందమ్మలు తయారుచేసే కళాకార కుటుంబాలు ఈఏడు నందన్మ విగ్రహాలు ఆర్డర్లతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమ, మంగళవార్లో తగులు, మిగులుతో ఈ పండగ చేసుకుంటున్నట్టు భక్తులు తెలిపారు. ఒక నందన్నను రూ.2500, వినాయకునితో కలిసి ఉన్న నందన్న రూ.3500లకు అమ్ముతున్నట్టు కటికవీధిలో ఒక కళాకారిణి తెలియజేశారు.

నేటి నుంచి నందన్న ఉత్సవాలు

నేటి నుంచి నందన్న ఉత్సవాలు