ఇసుకాసురుల ముందుచూపు! | - | Sakshi
Sakshi News home page

ఇసుకాసురుల ముందుచూపు!

Jun 4 2025 1:17 AM | Updated on Jun 4 2025 1:17 AM

ఇసుకా

ఇసుకాసురుల ముందుచూపు!

శ్రీకాకుళం రూరల్‌ :

చిత ఇసుక విధానం కూటమి నేతల పంట పండిస్తోంది. కొందరు నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగిస్తూ నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా ఇసుక వ్యాపారం సాగిస్తూ కోట్ల రూపాయలు జేబులు నింపుకొంటున్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండల పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలైన బైరి, కరజాడ ప్రాంతాల్లో రాత్రిపగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రెవెన్యూ, మైన్స్‌ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం.. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీలు సైతం తవ్వకాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో తవ్వకాలు అనుమతులు కంటే భారీగా సాగుతున్నాయి. రానున్న వర్షాకాలంలో పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం సాగించేందుకే ఇలా భారీ ఎత్తున ఇసుకను పోగేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాల్టా చట్టానికి తూట్లు..

వాస్తవంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చే ముందు గ్రౌండ్‌ వాటర్‌ పరిశీలన చేయాల్సి ఉంది. ఇక్కడ తక్కువ మోతాదుల్లో నీటి సాంద్రత ఉండటం, గ్రౌండ్‌ వాటర్‌ అడుగంటడం, చుట్టూ వ్యవసాయ బోర్లు ఉన్నప్పటికీ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. భైరి, కరజాడ ప్రాంతాల్లో 1.5 మీటర్లు వరకే తవ్వకాలు చేయాల్సి ఉన్నా దాన్ని అధిగమించి భారీ ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు.

ఇరువైపులా ఇసుక పోగులే..

బైరి నుంచి కరజాడ జంక్షన్‌ జాతీయ రహదారి మీదుగా వెళ్లే వంశధార నదికి ఆనుకొని ఉన్న ప్రదేశంలో కొన్ని వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను కూటమి నేతలు నిల్వ చేసేశారు. బ్రిడ్జికి రెండువైపులా ఎక్కడికక్కడ ఇసుక పోగులు కనిపిస్తుంటాయి. అక్కడితో ఆగకుండా తోటలు, పంట పొలాల గట్లుపై కూడా సుమారు 15వేల టన్నులకు పైగా ఇసుక నిల్వలు పోగేశారు.

ముందస్తు వ్యూహం..

ప్రస్తుతం చేస్తున్న పోగేస్తున్న ఇసుక నిల్వలతో రానున్న వర్షాకాలంలో మరింతగా ఇసుక వ్యాపారం చేసి లాభాలు గడించాలని అక్రమార్కులు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రేట్లు కన్నా వర్షాకాలంలో డబుల్‌, త్రీబుల్‌ రేట్లుగా వేసుకొని ఇసుకను బ్లాక్‌మార్కెట్‌లో అమ్మడం కోసమే బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో నిల్వలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

రానున్న వర్షాకాలం నేపథ్యంలో

ముందస్తుగా భారీగా ఇసుక నిల్వలు

బైరి, కరజాడ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో

15 వేల టన్నులకు పైగా పోగులు

స్పందించని రెవెన్యూ, మైన్స్‌ అధికారులు

దాడులు చేస్తాం..

అక్రమ ఇసుక నిల్వలపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీసులు, మైన్స్‌ అధికారులు రెండు బృందాలుగా వీడి తనిఖీలు చేయనున్నాం. ఎక్కడ అక్రమంగా నిల్వలు ఉన్నా సీజ్‌ చేస్తాం.

– మురళీకృష్ణ,

డిప్యూటీ డైరెక్టర్‌, మైన్స్‌

ఇసుకాసురుల ముందుచూపు! 1
1/3

ఇసుకాసురుల ముందుచూపు!

ఇసుకాసురుల ముందుచూపు! 2
2/3

ఇసుకాసురుల ముందుచూపు!

ఇసుకాసురుల ముందుచూపు! 3
3/3

ఇసుకాసురుల ముందుచూపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement