తీర్థయాత్రలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు

Jun 4 2025 1:17 AM | Updated on Jun 4 2025 1:17 AM

తీర్థయాత్రలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు

తీర్థయాత్రలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు

ఆమదాలవలస: తీర్థయాత్రలకు రైల్వే శాఖ ప్రత్యేక ఎయిర్‌ రైల్వే ప్యాకేజీలు తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ టూరిజం ఎగ్జిక్యూటివ్‌ సంఘమిత్ర రౌల్‌ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ వద్ద విలేకరులతో ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అనుకూలంగా విమాన ప్యాకేజీతో శాంకరీ దేవి శక్తి పీఠం, శ్రీలంక రామాయణ యాత్రలకు విశాఖ నుంచి విమాన సర్వీసు నడుపుతున్నట్లు చెప్పారు. జూన్‌ 28న మొదలై జూలై 3తో ముగుస్తుందని తెలిపారు. ఒక వ్యక్తికి రూ.69,450 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా, కేరళ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశామన్నారు. వివరాలకు 9281030748, 9281495847 నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.ఉమామహేశ్వరరావు, చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వినేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement