
వైభవంగా కంచమ్మతల్లి వారోత్సవాలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో నిర్వహిస్తున్న కంచమ్మతల్లి గ్రామదేవత ఉత్సవాలు రెండోరోజు మంగళవారం వైభవోపేతంగా జరిగాయి. అమ్మవారిని పీఠస్థానం నుంచి మఠం కంచిలి తీసుకొచ్చి, అక్కడి నుంచి ఊరేగింపుగా మెయిన్రోడ్డులోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నాగదేవతలు, అమలాపురం కేరళ డ్రమ్స్, పద్మనాభపురం దూమ్ ధడాకా, పాలబొమ్మలు, స్థానిక కళాకారుల గ్రూపు డ్యాన్స్, రాజమండ్రి సినీ కోయడ్యాన్స్ తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుల చేసిన బొడ్డపాడు కళాకారుల జానపదాలు అలరించాయి. రైల్వేస్టేషన్ కూడలిలో మెయిన్రోడ్డు పక్కన కంచమ్మతల్లి అమ్మవారి నమూనా విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. బంగారు, వజ్రాభరణాలను అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

వైభవంగా కంచమ్మతల్లి వారోత్సవాలు

వైభవంగా కంచమ్మతల్లి వారోత్సవాలు