ట్రాక్టర్‌–బైక్‌ ఢీ: ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌–బైక్‌ ఢీ: ఒకరి మృతి

Jun 3 2025 5:45 AM | Updated on Jun 3 2025 5:45 AM

ట్రాక

ట్రాక్టర్‌–బైక్‌ ఢీ: ఒకరి మృతి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి సదాశివపూర్‌ గ్రామ సమీపంలో జయపురం–బలిమెల రహదారిపై సోమవారం సాయంత్రం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న భార్యాభర్తలు, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి పడిపోయాడు. ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కోరుకొండ సమితి పరిధిలో ఉన్న ఎంవీ 104 గ్రామానికి చెందిన దిలీప్‌ రూపతాన్‌ (50) తన భార్య సుచిత్రా (43)తో కలిసి బైక్‌పై ఉమర్‌కోటలోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన సుచిత్రను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రాక్టర్‌–బైక్‌ ఢీ: ఒకరి మృతి 1
1/1

ట్రాక్టర్‌–బైక్‌ ఢీ: ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement