
జొరిపంగలో మలేరియా విజృంభణ
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి తొంబాగుడ పంచాయతీలోని జొరిపంగ గ్రామంలొ మలేరియా విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడిన వారు కళ్యాణసింగుపూర్ ప్రాథమిక ఆరొగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడిన వారి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా మలేరియా సొకినట్లు తేలింది. ప్రస్తుతం ఈ గ్రామంలొ శాంతి నాగ్ (55), సుభాష్ మాఝి (54), సస్మిత మాఝి (27), సురియా మాఝి (60), నిలు మాఝి (20), ప్రేమీ మాఝి (10), దీనబంధు మాఝి (48), శాంతి మాఝి (40), సూర్య మాఝి (25), శివాని మాఝి (25), రుంబా మాఝి(30), రామీ మాఝి, రస్మీ మాఝి, దిలసన్ మాఝి, సునీల్ మాఝి, మదంతి మాఝి, జగిలొ మాఝి, రొహిద్ మాఝి, శకుంతల మాఝి, సంతొష్ మాఝిలు ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. మలేరియా విజృంభణ సమాచారం తెలుసుకున్న వైద్యులు పద్మపూర్ మెడికల్ అధికారి డాక్టర్ రుతుపూర్ణ పట్నయక్ నేతృత్వంలో ఒక బృందం ఆదివారం జొరిపంగ గ్రామంలో పర్యటించింది. అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసిన బృందం అనారోగ్యంతొ ఉన్న కొందరి రక్తనమూనాలను సేకరించింది. అనంతరం వారికి మందులను పంపిణీ చేసింది. అయితే పరిస్థితి అదుపులో ఉందని వైద్య బృందం తెలిపింది. సేకరించిన రక్త నమూనాలను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి పరీక్షలు చేసిన అనంతరం మెరుగైన చికిత్సను అందిస్తామని తెలియజేసింది.