
ఉత్సవాలకు సిద్ధం
బురదల పోలమ్మ ..
అమ్మవారి మందిరం
రాయగడ: పట్టణ ప్రజల ఆరాధ్య దైవం బురదల పోలమ్మ అమ్మవారి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. తొమ్మిది రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాలు జూన్ 11తో ముగుస్తాయి.
ఉత్సవ కమిటీ ఏర్పాటు
ఉత్సవాలను నిర్వహించేందుకు అందరి సమక్షంలో ఏర్పాటైన కమిటీలో అధ్యక్షులుగా బార్జి జగన్ మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా ఎద్దు శ్రీహరి, కార్యదర్శిగా జె.శివాజి, కన్వీనర్గా కింతలి శ్రీనివాస్ రావు, కోశాధికారిగా బొత్స శ్రీనివాస్ రావు, సహ కోశాధికారిగా టెంటు వెంకటేష్లు ఉన్నారు.
చాటింపు
ఉత్సవాలపై అమ్మవారికి ప్రీతికరమైన ఆదివాసీ డప్పు వాయిద్యం మధ్య ఊరిబారికి ఈ చాటింపు వేశారు. చాటింపు కార్యక్రమం విన్న వారు ఒకవేళ ఏదైనా పనిమీద బయట ఊరు వెళితే అనుపు పండగ రోజు (ఉత్సవాల ముగింపు రోజు) న తిరిగి రావాలన్నది సంప్రదాయం.
ఉజ్జిడి బండి
చాటింపు కార్యక్రమం అనంతరం ఆదివారం తెల్లవారున ఉజ్జిడి బండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. వెదురుతో రూపొందించిన బుట్టను ఒక బండిలో ఏర్పాటు చేసి వేకువ జామున బండిని పురవీధుల్లో తిప్పుతారు. ఈ సమయంలో ప్రజలు రాత్రి ఉంచిన చద్దన్నం బుట్టలో వేస్తారు. ఇలా సేకరించిన చద్దన్నాన్ని స్థానిక రాణిగుడఫారంలో గల డీఎఫ్ఓ కాలనీలో (ఏనుగుల శాల) వద్ద పడేస్తారు. ఈ ఉజ్జిడి బండిలో చద్దన్నం వేస్తే కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని నమ్ముతారు.
ఉత్సవ విశేషాలు
సోమవారం నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి ఉత్సవాల్లో అదేరోజు సాయంత్రం ఆదివాసీ మేళతాళాలతొ పట్టణ ప్రజలు, ప్రముఖులు అమ్మవారి పాదాలను తీసుకువచ్చేందుకు వెళతారు. స్థానిక భైరవీధిలొ గల దొర ఇంటి నుంచి తీసుకువచ్చిన పాదాలను అమ్మవారి మందిరంలో ఏర్పాటు చేస్తారు. అనంతరం స్థానిక ట్రెజరీ వద్ద అమ్మవారి ఘటాలను తీసుకువస్తారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు ఊరేగింపు, పాలదార, అసర్లు, నాయుడు,నాయురాళ్ల విత్తనాలు వేయడం, అంజలి రథం వంటివి ఉంటాయి.
రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
చురుగ్గా ఏర్పాట్లు
సంప్రదాయాలకు ప్రతీక..
పూర్వీకులు అందించిన సంప్రదాయాలకు ప్రతీకగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అందరి సహకారంతో ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా జరిగేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అనుపోత్సవాలకు లక్షల మంది వస్తారు. అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం.
– బార్జి జగన్ మోహన్ రావు, ఉత్సక కమిటీ అధ్యక్షుడు
అందరి సహకారంతో..
ఉత్సవాలకు ప్రజల సహకారం ఉంటుంది. వారికి తోచిన సహకారం అందిస్తుండడంతో ఉత్సవాలు ఏటా ఘనంగా జరుగుతున్నాయి. అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తాం.
– ఎద్దు శ్రీహరి, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు
రూ.15 లక్షలతో ఉత్సవాలు
ఈ ఏడాది ఉత్సవాలకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని భావిస్తున్నాం. అందుకు అనుగుణంగా ప్రజలు సహకరిస్తున్నారు. సంప్రదాయాలకు ప్రతీకగా ఈ ఉత్సవాలను ఏటా నిర్వహిస్తున్నాం. నిధులు మిగిలితే ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నాం.
– బొత్స శ్రీనివాస్ రావు, ఉత్సవ కమిటీ కోశాధికారి

ఉత్సవాలకు సిద్ధం

ఉత్సవాలకు సిద్ధం

ఉత్సవాలకు సిద్ధం

ఉత్సవాలకు సిద్ధం

ఉత్సవాలకు సిద్ధం

ఉత్సవాలకు సిద్ధం

ఉత్సవాలకు సిద్ధం

ఉత్సవాలకు సిద్ధం