
గుప్తేశ్వర క్షేత్రంలోకి కుక్కలపిల్లలతో ఇద్దరి ప్రవేశం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వర్ ఆలయంలోనికి ఇద్దరు యువకులు రెండు కుక్క పిల్లలతో ప్రవేశించటాన్ని భక్తులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గత బుధవారం జరిగిన ఈ సంఘటన నేడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు యువకులు కుక్కలతో వచ్చి పూజలు చేశారని, ఇది గుప్తేశ్వర్ పుణ్య క్షేత్ర పవిత్రతకు, భక్తుల మనోభావాలకు భంగం కల్పించడమేనని విమర్శించారు. భవిష్యత్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తేనెటీగల దాడిలో
భార్యాభర్తలకు గాయాలు
రాయగడ: తేనెటీగల దాడిలో భార్యభర్తలు గాయాలు పాలైన ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. గాయాలు పాలైనవారు సమితిలోని కడంగేలి గ్రామానికి చెందిన కడ్రక మిసి, కడ్రక కొమరాడిలుగా గుర్తించారు. తమ గ్రామం నుంచి కల్యాణ సింగుపూర్ సొంత పనులపై వెళ్లి తిరిగి వస్తుండగా కల్యాణి నది బ్రిడ్జి కింద ఉన్న తేనెపట్టు నుంచి ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు గాయాల పాలయ్యారు. వెంటనే అక్కడ ఉన్నవారు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిస అనంతరం వారు స్వగ్రామానికి చేరుకున్నారు.

గుప్తేశ్వర క్షేత్రంలోకి కుక్కలపిల్లలతో ఇద్దరి ప్రవేశం