
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రాయగడ: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కాసీపూర్ సమితి కొడిపారి పంచాయతీలోని దుండా గ్రామానికి చెందిన జితు నాయక్, తిరాంపూర్ గ్రామానికి చెందిన కర్ణ హరిజన్లు ఉన్నట్లు గుర్తించారు. తీవ్రగాయాలకు గురైన వీరిని చికిత్స కోసం టికిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కర్ణ హరిజన్ టికిరిలోని ఉత్కళ అలూమిన కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా తమ గ్రామం నుంచి వెళ్తుండగా ఎదురుగా మరో బైకుపై వస్తున్న జితు నాయక్ అదుపు తప్పి డీకొన్నాడు. దీంతొ ఇద్దరికీ గాయాలయ్యాయి.
గాయాలతో చికిత్స పొందుతున్న కర్ణ హరిజన్