భారీగా గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి పట్టివేత

May 29 2025 1:11 AM | Updated on May 29 2025 1:11 AM

భారీగ

భారీగా గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి:

ల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు మంగళవారం రాత్రి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 1,190 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. బలిమెల–చిత్రకొండ ప్రధాన రహదారిలో గల నూగూడ గ్రామ సమీపంలోని అడవిలో గంజాయిని హర్యాణా రాష్ట్రానికి తరలించేందుకు దాచినట్లు ముందస్తు సమాచారం వచ్చింది. బలిమెల పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మనోహర్‌ సాహు నేతృత్వంలోని బృందం బలిమెల–యపూరం రహదారిలో సదాశివపూర్‌ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సమీపంలోని అడివిలో నాలుగురు వ్యక్తులు రెండు బైక్‌లతో గంజాయి బస్తాల వద్ద ఉన్నారు. పోలీసుల రాకను చూసి పారిపోతుండగా వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. ఒకరు పారారయ్యాడు. ముగ్గురిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. గంజాయి బస్తాలను స్టేషన్‌కు తరలించారు. బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గంజాయిని తూకం వేశారు. 1,190 కేజీలు ఉంది. దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని బలిమెల ఐఐసీ ధీరజ్‌ పట్నాయక్‌ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు హర్యాణాకు చెందిన హరిష్‌ సోనీ, సందీప్‌ కుమార్‌, ఒకరు బలిమెల పోలీసు స్టేషన్‌ పరిధిని నీలకాంబేరి గ్రామానికి చెందిన సునీల్‌ కుమార్‌ ప్రదాన్‌గా గుర్తించారు. బుధవారం సాయంత్రం కోర్టుకు తరలించారు. పారారైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

30 కేజీలతో ఇద్దరు అరెస్టు..

మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు బుధవారం మధ్యాహ్నం 30 కేజీల గంజాయిని స్వాధీనం చేకున్నట్లు బలిమెల ఎస్‌ఐ అజిత్‌ సింగ్‌ తెలిపారు. బలిమెల పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల రహదారిలో స్కూటీ అతివేగంగా వస్తూ అదుపు తప్పి పడిపోయింది. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉండటంతో వారిని బలిమెల ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. స్కూటీలోని రెండు పాలిథిన్‌ కవర్‌లలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి విచారించారు. వీరు చిత్రకొండ సమితి పనాస్‌పూట్‌ పంచాయతీలో గురుఖీలో అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఛత్తీష్‌గఢ్‌ రాష్ట్రం జగదల్‌పూర్‌కు తరలిస్తున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తూకం వేస్తే 30 కిలోలు ఉందని, దీని విలువ రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. పూర్తి విచారణ అనంతరం గురువారం కోర్టుకు తరలిస్తామన్నారు. నిందితులు ఇద్దరు బలిమెలకు చెందిన అమాన్‌ ఖీలో, రాజి మహోల్దార్‌గా గుర్తించారు.

భారీగా గంజాయి పట్టివేత 1
1/2

భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత 2
2/2

భారీగా గంజాయి పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement