మనది బలమైన బంధం | - | Sakshi
Sakshi News home page

మనది బలమైన బంధం

May 27 2025 12:40 AM | Updated on May 27 2025 12:40 AM

మనది

మనది బలమైన బంధం

మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025
ఆగ్నేయ ఆసియాతో..

భువనేశ్వర్‌: గతం కేవలం చరిత్రగా మిగిలిపోయేది కాదని, వర్ధమాన ప్రపంచంతో వ్యవహరించడానికి ఉపయోగకరమైన ఆలోచనలను అందజేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి ప్రసంగంలో తెలిపారు. రెండు రోజుల తృతీయ అంతర్జాతీయ భారతీయ సాంస్కృతిక వారసత్వ సదస్సు (ఐసీఐసీహెచ్‌) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇరుగు పొరుగు ప్రాంతాలతో అవినావభావ సంబంధాల రంగంలో ఉమ్మడి పరిశోధనలు అవసరమని తెలిపారు. కళింగ, ఆగ్నేయాసియా నాగరికత అనుసంధానం అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రాచీన కళింగ సముద్ర (నావిక) వారసత్వం పర్యావరణ, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడంలో ఆగ్నేయ ఆసియాకు బలమైన అనుభవాల్ని అందజేస్తుందన్నారు. ఇండోనేషియా, మలేషియా, మయన్మార్‌, థాయిలాండ్‌, కంబోడియా, వియత్నాం వంటి దేశాలతో నావికా వ్యాపారం, అన్వేషణ, సాంస్కృతిక ప్రతిస్పందన కేవలం ఒడిశా గొప్ప చరిత్ర, గర్వించదగ్గ విషయం మాత్రమే కాదు సమకాలీన ప్రాంతీయ సహకారానికి మార్గదర్శకం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సు ఒడిశా అద్భుతమైన గతంతో తిరిగి అనుసంధానించడంలో ఒక అర్థవంతమైన అడుగు అని అభివర్ణించారు. నాటి కళింగ నేటి ఒడిశా రెండు వేల సంవత్సరాలకు పైగా ఆగ్నేయాసియాతో బలమైన సముద్ర, సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రజలు విస్త్తృత ప్రయాణాలు శిల్పాలు, శాసనాలు, ఆచారాలు మరియు స్థల పేర్లలో ప్రతిబింబిస్తున్నాయి. భారతీయ సంస్కృతి, మత వ్యాప్తిలో కళింగ సముద్ర నెట్‌వర్క్‌ ప్రధాన పాత్ర పోషించిందని ఆయన నొక్కి చెప్పారు. ‘కంబోడియాలోని అంగ్‌కర్‌ వాట్‌, ఇండోనేషియాలోని బోరోబుదూర్‌ వంటి దేవాలయాలు కళింగ ఆలయ నిర్మాణ ప్రభావాన్ని చూపుతాయి. రామాయణం, మహాభారతం మరియు సంస్కృతం వ్యాప్తి, ఇండోనేషియాలో నైపి, కంబోడియాలో ప్చుమ్‌ బెన్‌ వంటి పండుగల వేడుకలు లోతైన సాంస్కృతిక బంధాలను ప్రతిబింబిస్తాయి’ అని ఆయన అన్నారు. ఆధునిక దేశాలు ఈ వారసత్వం నుంచి ఆచారవ్యవహారాలు పరస్పర గౌరవం, స్థానిక సంప్రదాయాలను సుసంపన్నం చేయడం నేర్చుకోవచ్చని డాక్టర్‌ కంభంపాటి సూచించారు. ఓడరేవు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గ్రీన్‌ షిప్పింగ్‌ను స్వీకరించడం, డిజిటల్‌ సాంస్కృతిక అనుబంధం ప్రోత్సహించడం ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేయగలవని తెలిపారు. భవిష్యత్‌ తరాలు గర్వించే రీతిలో ఉమ్మడి పరిశోధన మరియు వారసత్వ విద్య ప్రాధాన్యతని సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఇతరులలో కటక్‌ లోక్‌ సభ సభ్యుడు భర్‌ృత్తహరి మహతాబ్‌, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి లలిత్‌ మానసింగ్‌, ఒడియా భాష, సాహిత్యం మరియు సంస్కృతి విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ సంజీబ్‌ కుమార్‌ మిశ్రా మరియు వన్‌ ఆసియా ఫౌండేషన్‌ చైర్మన్‌ పతిత పావన మిశ్రా, తృతీయ ఐసీఐసీహెచ్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉపేంద్ర పాఢి ఉన్నారు.

న్యూస్‌రీల్‌

రాష్ట్ర గవర్నర్‌ డాక్టరు కంభంపాటి

హరి బాబు

మనది బలమైన బంధం1
1/4

మనది బలమైన బంధం

మనది బలమైన బంధం2
2/4

మనది బలమైన బంధం

మనది బలమైన బంధం3
3/4

మనది బలమైన బంధం

మనది బలమైన బంధం4
4/4

మనది బలమైన బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement