
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లి తీసుకువస్తున్న యువతులు
బిందెడు నీళ్ల కొసం మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లి తీసుకువస్తున్న యువతులు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి గుడారి పంచాయతీలొ గల తొలొబొండాగుగుడ గ్రామం నీటి కోసం కన్నీరు పెడుతోంది. ఇక్కడ సుమారు 30 ఆదివాసీ తెగకు చెందిన 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందరికీ ఒకే ఒక గొట్టపు బావి ఉండడంతో తాగునీటి సమస్యతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. బావి నుంచి నీరు తోడీ తోడీ భుజాలు అరిగిపోతున్నాయి. ఇంత తోడినా 10 నుంచి 12 బిందెలకు మించి రావడం లేదు. దీంతో వీరంతా గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో గల నది నుంచి కలుషిత నీటిని తీసుకువచ్చి దాన్ని వడగట్టి తాగునీటిగా వినియోగిస్తున్నారు. నీటి సమస్యపై చాలా సార్లు అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. అసలే వేసవి కాలం కావడంతో మండుటెండలో నది నుంచి నీటిని తీసుకురాలేకపోతున్నామని, కూలి పనులు మానుకుని నీటి కోసం వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
న్యూస్రీల్
పరిష్కారమే లేదా..?
గ్రామంలో తాగునీటి సమస్య విలయతాండవం చేస్తోంది. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. గొట్టపు బావి వేసినా లాభం లేదని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. మరి మా గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారమే లేదా..?
– సనొబుడు టుకురుక, గ్రామస్తుడు

సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025

సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025