
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటండి
● పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్
కొరాపుట్: రానున్న మూడంచెల పంచాయతీ ఎన్నికలలో కార్యకర్తలు సత్తా చాటాలని పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ పిలుపునిచ్చారు. ఆదివారం కొరాపుట్ జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికలలో కష్టపడి తమ పని తీరు చూపించుకోవాలన్నారు. ఆ తర్వాత ఎంపీ, ఎంఎల్ఎ టిక్కెట్ల కోసం రావాలన్నారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్పై ఎంపీ, ఎంఎల్ఏగా పోటీ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అన్నారు. క్షేత్రస్థాయిలో పని చేయకుండా లాబీయింగ్ చేసి టిక్కెట్ పొందాలంటే కుదరదన్నారు. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని భక్త చరణ్ దాస్ కోరారు. అంతకుముందు పీసీసీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మీనాక్షి వాహీని పతితో చర్చలు జరిపారు. అతని వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు అజయ్ లల్లూ, కొరాపుట్ ఎంపీ సప్త గిరి ఉల్క, సీఎల్పీ నాయకుడు రాం చంద్ర ఖడం, ఎమ్మెల్యేలు మంగులు కిలో, పవిత్ర శాంత, అప్పల స్వామి కడ్రకలు ఉన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటండి