
వ్యవసాయ రంగానికి పెద్దపీట
రాయగడ: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ఆదివాసీ, హరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాల సంక్షేమ శాఖల మంత్రి నిత్యానంద గొండా అన్నారు. పవిత్ర అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం గుణుపూర్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా ముందుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం పొలం దున్ని, విత్తనాలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఫరూల్ పట్వారి, బీజేపీ నాయకులు శివశంకర్ ఉలక, రబి గొమాంగో తదితరులు
మంత్రి నిత్యానంద గొండా
పాల్గొన్నారు.
విత్తనాలు చల్లిన విద్యార్థులు
జిల్లాలోని గుణుపూర్లో ఉన్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ విభాగానికి చెందిన విద్యార్థులు అక్షయ తృతీయ పురస్కరించుకొని పంట పొలాల్లో విత్తనాలు జల్లారు. ఆ విభాగం ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ మిశ్రో, ప్రొఫెషర్ డాక్టర్ సుశాంత్ కుమార్ మహంతి, డాక్టర్ రినా స్వయి, అధ్యాపకులు, వ్యవసాయ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ కిషాన్ మోర్చ ఆధ్వర్యంలో సదరు సమితి అకుసింగి గ్రామంలో అక్షయ తృతీయ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పార్టీ డీఎల్పీసీ సభ్యులు సుమంత్ కుమార్ మహరణా, జిల్లా కృషక్ మోర్చ అధ్యక్షుడు కృష్ణ పండ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట