
లక్ష్మీనృసింహునికి ప్రత్యేక అభిషేకాలు
రాయగడ: కొలనార సమితి అమలాభట్ట వద్దనున్న శ్రీక్షేత్రటౌన్ షిప్లోని శ్రీలక్ష్మీ నృసింహ ఆలయంలో పవిత్ర అక్షయ తృతీయ పురస్కరించుకొని మంగళవారం నుంచి చందనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాథ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఆరాధన, దీపారాధన, క్షీరాభిషేకాలతో పాటు చందనాభిషేకాలు చేపట్టారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్రావు పరివేక్షణలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అభిషేకాలు చేస్తున్న అర్చకులు