
స్వావలంబనకు ‘ఆర్థిక’ ఆయుధం..
వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారు. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా కృష్ణాజిల్లాలో 90,057 మంది లబ్ధిదారులకు రూ. 135.09 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 31,906 మంది లబ్ధిదారులకు రూ. 47.85 కోట్లు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 58,095 మంది లబ్ధిదారులకు రూ. 87.14 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 56,898 మంది లబ్ధిదారులకు రూ. 85.35 కోట్లు నగదు జమ చేశారు.
కనిపించని స్వావలంబన.. స్వలాభమే అంతా..
మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయటం లేదు. ప్రతి మహిళకు రూ.1500 నెలకు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. ఉచిత బస్సు ప్రయాణం హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి నాలుగు నెలలకు ఒక సిలిండర్ను అందజేసే విధంగా నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా ఇచ్చిన గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ కూడా లబ్ధిదారుల ఖాతాలో సరిగా జమ కావటం లేదని వారే వాపోతున్నారు.