నేడు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కలెక్టర్‌ జి.లక్ష్మీశ | - | Sakshi
Sakshi News home page

నేడు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కలెక్టర్‌ జి.లక్ష్మీశ

May 31 2025 1:29 AM | Updated on May 31 2025 1:29 AM

నేడు

నేడు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కలెక్టర్‌ జి.లక్ష్

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జూన్‌ 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 31వ తేదీ శనివారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కింద 2,27,786 పెన్షన్లకు దాదాపు రూ. 98.11 కోట్లు పంపిణీ చేస్తారని చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. శుక్రవారం కలెక్టర్‌ లక్ష్మీశ.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెన్షన్ల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఆర్డీఓలో కావూరి చైతన్య, కె.మాధురి, కె.బాలకృష్ణ, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

ఆలిండియా సహకార భారతి డెయిరీ

సెల్‌ డైరెక్టర్‌గా చలసాని

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): ఆలిండియా సహకార భారతి డెయిరీ సెల్‌ డెరెక్టర్‌గా కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) చైర్మన్‌ చలసాని ఆంజనేయులను ఎన్నుకున్నట్టు ఏపీ సహకార భారతి చైర్మన్‌ అడ్డూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ బోర్డు మీటింగ్‌ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో చలసాని ఆంజనేయులకు, అడ్డూరి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ 24వ తేదీ గుజరాత్‌లోని ఆనంద్‌లో ఆలిండియా సహకార భారతి సమావేశం జరిగిందన్నారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ తరఫున చైర్మన్‌ చలసాని ఆంజనేయులు హాజరు కావడంతో పాటు సహకార రంగంలో విజయ డెయిరీ సాధిస్తున్న విజయాలను, రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరించారన్నారు. సహకార రంగంలో పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సహకార భారతి డెయిరీ సెల్‌ను ఏర్పాటు చేశారన్నారు. దానిలో జాతీయ స్థాయిలో పది మంది డైరెక్టర్లలో చలసాని ఆంజనేయులను ఒకరిగా ఎంపిక చేశారని తెలిపారు. సహకార రంగంలో ఇబ్బందులకు గురయ్యే వారికి వెన్నుదన్నుగా ఉండాలనే లక్ష్యంతో 1979లో సహకార భారతి ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీనివాసరావును విజయ డెయిరీ బోర్డు చైర్మన్‌, డైరెక్టర్లు శాలువాతో సత్కరించారు.

నేడు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కలెక్టర్‌ జి.లక్ష్1
1/1

నేడు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కలెక్టర్‌ జి.లక్ష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement