
కిక్కిరిసిన నవీపేట మేకల సంత
● దసరా నేపథ్యంలో జోరుగా కొనుగోళ్లు ● రూ. 3కోట్లకు పైగా లావాదేవీలు
నవీపేట: మండల కేంద్రంలో శనివారం జరిగిన మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. అక్టోబరు 2న దసరా ఉండడంతో ఈ సంతలో క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. సంత ప్రాంగణం బురదమయంగా మారడంతో చుట్టుపక్కల రహదారులు, బస్టాండ్ ఆవరణలో జోరుగా క్రయవిక్రయాలు జరిపారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు క్లియర్ చేశారు. సుమారు రూ. 3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.