
గోదావరిలోకి తగ్గిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి అధికారులు గురువారం నీటి విడుదలను తగ్గించారు. బుధవారం 4 లక్షల క్యూసెక్కులను విడుదల చేసిన అధికారులు గురువారం 2 లక్షల క్యూసెక్కులకు తగ్గించారు. 39 వరద గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి 3 లక్షల 15 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఇన్ ఫ్లోతో ఎక్కువగా ఉండి, అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద కాలువ ద్వారా 5,834 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువ ద్వారా 400, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా మిషన్భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 591 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం రాత్రి సమ యానికి 1082.8000(52.8టీఎంసీలు) అడు గుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.