కోనేరులో జారిపడి ఒకరు.. | - | Sakshi
Sakshi News home page

కోనేరులో జారిపడి ఒకరు..

Jun 1 2025 1:33 AM | Updated on Jun 1 2025 1:33 AM

కోనేరులో జారిపడి ఒకరు..

కోనేరులో జారిపడి ఒకరు..

రామారెడ్డి: ప్రమాదవశాత్తు కోనేరులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలం మద్దికుంటలో శనివారం చోటు చేసుకుంది. ప్రొబెషనరీ ఎస్సై నవీన్‌చంద్ర తెలిపిన వివరాల ప్ర కారం.. మద్దికుంటకు చెందిన ఓరుగంటి గంగయ్య(50) తన భార్య 20 సంవత్స రాల క్రితం వెళ్లగా అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్నాడు. వృద్ధాప్యం కారణంగా ఇటీవలే మద్దికుంట వృద్ధాశ్రమానికి వచ్చాడు. బుగ్గ కోనేరులో శనివారం స్నానం చేసేందుకు వెళుతుండగా, ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, భార్య ఓరుగంటి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై తెలిపారు.

చేపూర్‌లో ఒకరు..

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామ శివారులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి గుడి వద్ద కురాకుల మురళి(63) మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌ గ్రామానికి చెందిన మురళి కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి గుడికి వస్తుంటాడు. శుక్రవారం రాత్రి సైతం గుడికి వస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చంద్రశేఖర్‌ కాలనీకి చెందిన సంతోష్‌(37) ఆర్థిక ఇబ్బందులతో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రొబెషనరీ ఎస్త్సె శైలిందర్‌ తెలిపారు. చంద్రశేఖర్‌ కాలనీ చెందిన సంతోష్‌కు అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement