
బోధన్లో కార్డన్ సెర్చ్
బోధన్టౌన్: పట్టణంలోని బస్వతారక్నగర్ కాలనీలో శుక్రవారం ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంట్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ.. కార్డన్ సెర్చ్లో భాగంగా కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి అనుమతి పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, ఒక కారుతో పాటు ఒకే ఇంట్లో 35 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొత్తగా వచ్చిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించరాదని, కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐలు వెంకట నారాయణ, విజయ్ బాబు, కృష్ణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.