
భూ భారతి పకడ్బందీగా అమలు చేయాలి
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్లులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5 నుంచి 20 వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు. కాగా, భూభారతి నూతన చట్టంపై రాష్ట్రంలో 605 మండలాలకు గాను ఇప్పటివరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందని, 85,527 మంది పౌరులు, 1,62,577 మంది రైతులు అవగాహన సదస్సులలో పాల్గొన్నారని మంత్రి వివరించారు.
లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి..
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఎంపికలో అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్పష్టం చేశారు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా ఇంటి నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. వీసీలో సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నీట్కు పటిష్ట ఏర్పాట్లు..
ఈ నెల 4న జరగనున్న నీట్ పరీక్షకు పట్టిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. జిల్లాలో 3,398 మంది పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
5 నుంచి ఎంపిక చేసిన
మండలాల్లో రెవెన్యూ సదస్సులు
ఇందిరమ్మ ఇళ్లు 600 చదరపు
అడుగులకు మించొద్దు
రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర
సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

భూ భారతి పకడ్బందీగా అమలు చేయాలి