రైతుల వివరాలు అప్‌డేట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల వివరాలు అప్‌డేట్‌ చేయాలి

May 3 2025 12:19 AM | Updated on May 3 2025 12:19 AM

రైతుల

రైతుల వివరాలు అప్‌డేట్‌ చేయాలి

కోదండరెడ్డికి ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి వినతి

సుభాష్‌నగర్‌ : ఉ మ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలు, మిస్సింగ్‌ డేటాను రుణమాఫీ పోర్టల్‌లో అప్‌డేట్‌ అయ్యేలా చూడాలని ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ కుంట రమేశ్‌ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డిని హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం రమేశ్‌ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని సొసైటీల్లో సీబీలో నమోదు చేయని కారణంగా రుణమాఫీ వర్తించలేదని, ఆ రైతుల వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్‌ చేసి రుణాలు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్‌ కోదండరెడ్డి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా రుణమాఫీ అమలయ్యేలా చూస్తామని హామీనిచ్చారన్నారు. అంతకుముందు కోదండరెడ్డిని శాలువాతో సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు, టీజీసీఏబీ ఎండీ కృష్ణారావు పాల్గొన్నారు.

ఎప్‌సెట్‌ రాసి తిరిగి వస్తూ

అనంతలోకాలకు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు

నిర్మల్‌ జిల్లావాసులు మృతి

జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని అర్గు ల్‌ శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహ దారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందా రు. జక్రాన్‌పల్లి ఎస్సై ఎండీ మాలిక్‌ రహమాన్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన బానవత్‌ మంజుల(19), బానవత్‌ అశ్విని(17) శుక్రవారం ఎప్‌సెట్‌ రాసేందుకు కారులో హైదరాబాద్‌ వెళ్లారు. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. అర్గుల్‌ శివారులోని జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న అక్కా చెల్లెళ్లు మంజుల, బానవత్‌ అశ్విని అక్కడికక్కడే మృతి చెందారు. కారును నడుపుతున్న జాదవ్‌ హంసరాజుకు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.

పిల్లలు సెల్‌ఫోన్లకు బానిస కావొద్దు

ఖలీల్‌వాడి : పిల్లలు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని, బానిస కావొద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి అన్నారు. నగరంలోని ఆర్‌బీవీఆర్‌ఆర్‌లో విద్యార్థినులకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంప్‌ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జిల్లా జడ్జి పాల్గొని మాట్లాడారు. సెల్‌ఫోన్లతో మంచి, చెడు రెండు ఉంటాయన్నారు. సెల్‌ఫోన్లను మంచికి ఉపయోగించాలని, చెడు వైపు ఎక్కువగా ప్రభావితం కావొద్దన్నారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ఇతరులతో ఎలా ఉండాలో పిల్లలకు తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పాలన్నారు. విద్యార్థినులు చదువుకునేటప్పుడు ఈవ్‌టీజింగ్‌ ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలను సమ్మర్‌క్యాంప్‌లో నేర్చుకోవడం గొప్పవిషయమన్నారు.

ఆత్మస్థైర్యం పెరుగుతుంది : సీపీ

సమ్మర్‌ క్యాంప్‌ ద్వారా బాలికలకు ఆత్మస్థై ర్యం పెరుగుతుందని సీపీ సాయిచైతన్య అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని అపాయం జరిగితే స్పందించాలన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని, ఈ శిబిరం ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారన్నారు. అనంతరం శిక్షణ పొందిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌ సాయికిరణ్‌, నిజామాబాద్‌ సౌత్‌ రూరల్‌ సీఐ సురేశ్‌ కుమార్‌, రిటైర్డ్‌ సీఐ కిషన్‌, తైక్వాండో ట్రెయినర్‌ మనోజ్‌, జేసీఐ సభ్యులు విజయానంద్‌, ఆర్‌బీవీఆర్‌ఆర్‌ సొసైటీ సభ్యులు మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల వివరాలు అప్‌డేట్‌ చేయాలి
1
1/1

రైతుల వివరాలు అప్‌డేట్‌ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement