
రోడ్డు ప్రమాదంలో ముగ్గ్గురికి గాయాలు
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుప్యా తండాకు చెందిన లావణ్య, ఆమె భర్త రాథోడ్ దినేష్ ద్విచక్ర వాహనంపై పెట్రోల్ బంకులో పెట్రోలు పోయించుకుని తిరిగి నిర్మల్వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో అతివేగంగా సారంగాపూర్వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భూమేశ్ వారి వాహనాన్ని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో లావణ్య, దినేష్కు స్వల్ప గాయాలు కాగా భూమేష్కు తలకు గాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.