
కేసులకు భయపడేది లేదు..
● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ● బాధితుడికి పరామర్శ
శ్రీరాంపూర్: కాంగ్రెస్ సర్కార్లో అక్రమ కేసులను భయపడేది లేదని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శుక్రవారం ఆమె న స్పూర్లో పర్యటించారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు కందుల ప్రశాంత్పై ఇటీవల సీసీసీ నస్పూర్ పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఊరు శ్రీరాంపూర్లోని ఆయన నివాసానికి ఆమె వెళ్లి అతడితోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్రమ కేసులకు భయపడవద్దని, పార్టీ, తాను అండగా ఉంటామని చెప్పారు. కేసులతో జాగృతి నా యకులు, కార్యకర్తలను బెదిరించలేరని, తాను ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. అనంతరం నస్పూర్ కాలనీలో తెలంగాణ తల్లి విగ్రహాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఊరు శ్రీ రాంపూర్ వద్ద కవితను అభిమానులు గజమాలతో సత్కరించగా, మహిళలు మంగళహారతులతో స్వా గతం పలికారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అ ధ్యక్షుడు కందుల ప్రశాంత్, సింగరేణి జాగృతి శ్రీ రాంపూర్ కన్వీనర్ కుర్మ వికాస్, కార్యకర్తలు రత్నాకర్రెడ్డి, తొంగల రమేశ్, వినయ్ పాల్గొన్నారు.
జర్నలిస్టు మునీర్ కుటుంబానికి పరామర్శ
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎండి.మునీర్ గత శనివారం మృతిచెందగా.. శుక్రవారం ఆయన నివాసంలో మునీర్ భార్య రిజ్వానా, కుమారుడు మయూర్, కూతుళ్లు ముజిభా, రేష్మా, తన్వీర్ గౌసియా, తమ్ముళ్లు సందాని, మొహియోద్దీన్లను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునీర్ తెలంగాణ ఉద్యమానికి చాలా కృషి చేశారని అన్నారు. ఐఎఫ్టీయూ నాయకులు బ్రహ్మానందం పాల్గొన్నారు.
లక్సెట్టిపేటలో..
లక్సెట్టిపేట: ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల నుంచి హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యంలో లక్సెట్టిపేట పట్టణంలో ఆగారు. పట్టణానికి చెందిన జాగృతి నాయకురాలు నిషా, విశ్రాంత ఉద్యోగి విజయసారథి ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జన్నారం మాజీ జెడ్పీటీసీ ఎర్రం చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు.
గులాబీ శ్రేణుల దూరం..
కవిత పర్యటనకు బీఆర్ఎస్తోపాటు టీబీజీకేఎస్ నేతలు దూరంగా ఉన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె సింగరేణి క్షేత్రంలో పర్యటించిన సందర్భంలో నేతలెవ్వరూ హాజరు కాలేదు. కనీసం మర్యాద పూర్వకంగానూ కలువకపోవడం సింగరేణిలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. గతంలో ఆమె సింగరేణి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కార్మికులు, కార్మిక నేతలతో పెద్ద కాన్వాయ్ వెంట ఉండేది. నేతల హడావిడి చెప్పనక్కర్లేదు. కానీ నేడు ఎలాంటి హంగు ఆర్భాటాలు కనిపించలేదు. పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దూరంగా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది.