
బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపాధ్యాయుల ఎంపిక
నిర్మల్ రూరల్: జిల్లాలోని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపాధ్యాయుల ఎంపికను కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ సురేశ్బాబు ఉపాధ్యాయుల ప్రదర్శనలు పరిశీలించారు. 88 మంది ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఎం.ఎల్లన్న (ఎంపీపీ ఎస్ వానల్పాడు, బైంసా), జాడి శ్రీనివాస్(జెడ్పీహెచ్ఎస్ మస్కాపూర్), ప్రవీణ్కుమార్(ఎంపీపీఎస్ సేవాలాల్ తండా, లోకేశ్వరం)ను ఎంపిక చేసి వీరిపేర్లు హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపినట్లు అధికారులు తెలిపారు.